బెల్లంకొండ కవచం పరిస్థితి ఏంటి?
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం 'కవచం'. దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ళ ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్నారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కవచం సినిమా సెన్సర్ పూర్తి అయ్యింది. యు/ఏ సట్టిఫికేట్ పొందిన ఈ చిత్రం ఎలా ఉండబోతోంది ?
సెన్సర్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా ఒక ఒక రెగ్యులర్ రివెంజ్ డ్రామాగా తెలుస్తోంది. నూతన దర్శకుడు ఈ సినిమా కథను ఆసక్తికరంగా తెరకెక్కించారని సమాచారం. థ్రిల్లర్ నేపద్యంలో సాగే ఈ సినిమా కు కాజల్, మెహరిన్ గ్లామర్ మరో అదనపు ఆకర్షణ కానుందని టాక్ వినిపిస్తోంది.
నూతన నిర్మాణ సంస్థ వంశధార క్రియెషన్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించడం జరిగింది. బెల్లంకొండ శ్రీనివాస్ పై అంత బడ్జెట్ వర్క్ ఔట్ అవ్వకపోయినా వారు ఇలా చెయ్యడం ఆచ్చర్యమే. మరి సినిమా చివరికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
The post What is the censor report on Kavacham? appeared first on Social News XYZ.