ఆ ప్రచారం రోబో 2.0 కు ప్లస్ అయ్యింది !
రజినీకాంత్, అమీ జాక్షన్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నవంబర్ 29న ప్రపంచవప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రోబో 2.0 సినిమాకు అభ్యంతరాలు తలెత్తాయి. ఈ సినిమాలో మొబైల్ గురించి, సెల్ టవర్స్ గురించి నెగిటివ్ గా చూపిస్తున్నారు అంటూ చిత్ర బృందంపై టెలికాం సంస్తలు మండి పడ్డాయి. ఈ విషయమై సీవోఏఐ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. సినిమా కంటెంట్ టెల్కోల ప్రతిష్టకు భంగం కలిగించేదిగా ఉందంటూ సెన్సార్ బోర్డ్ ఇటువంటి సినిమాకు సట్టిఫికేట్ఎలా ఇస్తుందని ఆరోపించింది. ట్రైలర్ చూస్తుంటే పర్యావరణాన్ని మొబైల్ టవర్స్ , రేడియేషన్స్ నాశనం చేస్తున్నాయని అర్థం అవుతోంది. ఈ విధంగా సినిమా తీయడం కరెక్ట్ కాదని సీవోఏఐ రోబో 2.0 బృందం పై న్యూడిల్లీలో కేసు పెట్టడం జరిగింది.
కానీ సీవోఏఐ ఆరోపణలను కోర్టు తిప్పికొట్టింది. సినిమాను నవంబర్ 29 న విడుదల చేసుకోవచ్చని తెలిపింది. దీంతో చిత్ర యూనిట్ తో పాటు రజినీకాంత్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. మరి కొన్ని గంటల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక లొకేషన్స్ లో విడుదల కానుంది. సీవోఏఐ ;ఫిర్యాదు చెయ్యడం ఒకరకంగా చిత్రానికి ప్లస్ అయ్యింది కానీ మైనస్ కాలేదని టాక్ వినిపిస్తోంది. సినిమాపై పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువ స్పీడ్ గా స్ప్రెడ్ అవుతోంది.
The post Cell Service Providers controversy helping 2.0 movie appeared first on Social News XYZ.